Mon Mar 23 2026 09:36:10 GMT+0530 (India Standard Time)
రేపటి నుంచి రైతు బంధు పథకం నగదు జమ
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్. రైతు బంధు డబ్బులను రేపటి నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.

తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్. రైతు బంధు డబ్బులను రేపటి నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలుజారీ చేశారు. రైతుల ఖాతాల్లో నేరుగా రేపటి నుంచి విడతల వారీగా నగదును జమ చేయనున్నారు. రైతు బంధు పథకానికి అవసరమైన 7,500 కోట్ల నిధులను ప్రభుత్వం ఆర్థిక శాఖను కోరింది. ఆర్థిక శాఖ ఈ నగదును సర్దుబాటు చేయడంతో రేపటి నుంచి రైతు బంధు పథకం కింద రైతుల ఖాతాల్లో నగదు జమ అవతుంది.
విడతల వారీగా....
రేపటి నుంచి ఈ నెలాఖరు వరకూ రైతు బంధు పథకం కింద నగదును జమ చేస్తారు. తొలి రోజు ఎకరం ఉన్నవారికి, తర్ాత రెండు ఎకరాలు, ఆ తర్వాత మూడు ఎకరాలు ఉన్నవారి ఖాతాల్లో నగదు జమ కానుంది.
Next Story

