Fri Dec 05 2025 18:24:16 GMT+0000 (Coordinated Universal Time)
KCR : ఓటు హక్కును వినియోగించుకున్న కేసీఆర్ దంపతులు
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సిద్ధిపేట జిల్లాలోని చింతమడకలో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయనతో పాటు సతీమణి శోభ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేసీఆర్ పోలింగ్ కేంద్రానికి వచ్చిన సందర్భంలో ఆయనతో కరచాలనం చేసేందుకు పోటీ పడ్డారు.
ప్రాంతీయ పార్టీలదే...
కేసీఆర్ వెంట మాజీ మంత్రి హరీశ్ రావు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణలో పోలింగ్ బాగా జరుగుతుందని తెలిపారు. ఈసారి అత్యధిక శాతం పోలింగ్ నమోదయ్యే అవకాశముందని తెలిపారు. ఈ ఎన్నికల తర్వాత ప్రాంతీయ పార్టీలే దేశంలో కీలక పాత్ర పోషిస్తాయని కేసీఆర్ మీడియాతో అన్నారు.
Next Story

