Wed Jan 28 2026 20:47:11 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : బీజేపీ అధ్యక్షుడిగా రామ్ చందర్ రావు
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీరామచందర్ రావు పేరును ఖరారు చేసింది

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎవరన్నది తేలిపోయింది. గత కొన్నాళ్లుగా కొనసాగుతున్నఉత్కంఠకు తెరపడింది. మాజీ ఎమ్మెల్సీరామచందర్ రావు పేరును ఖరారు చేసింది. ఈ మేరకు నామినేషన్ వేయాలంటూ పార్టీ అధినాయకత్వం రామచంద్ రావును ఆదేశించించింది. మధ్యాహ్నం రెండు గంటలకు రామ చందర్ రావు నామినేషన్ వేయనున్నారు.
అనేక మంది పోటీ పడుతున్నా...
బీజేపీ అభ్యర్థి పదవి కోసం అనేక మంది పోటీ పడ్డారు. సీనియర్ నేతల నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా తమ పేర్లను పరిశీలించాలని అధినాయకత్వాన్ని కోరారు. కానీ పార్టీ నాయకత్వం మాత్రం చివరకు రామచందర్ రావు పేరును ఖరారు చేసింది. ఆర్ఎస్ఎస్ నేపథ్యంతో పాటు తొలి నుంచి పార్టీలో కొనసాగుతున్న రామచందర్ రావు పేరున ఖరారు చేసింది.
Next Story

