Wed Jan 21 2026 01:48:23 GMT+0000 (Coordinated Universal Time)
పోటీపై క్లారిటీ ఇచ్చిన మైనంపల్లి
మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు లోక్సభ ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇచ్చారు

మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు లోక్సభ ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇచ్చారు. తాను రానున్న పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. తన పోరాటం అంతా మల్లారెడ్డి అక్రమాలపైనే ఉంటుందని ఆయన అన్నారు. తనను మాట్లాడనివ్వకుండా మల్లారెడ్డి కొందరు మధ్యవర్తులతో మాట్లాడిస్తున్నారన్నారు.
మల్లారెడ్డి అక్రమాలపైనే...
కాంగ్రెస్ హైకమాండ్ తో కూడా ఇదే విషయంపై మాట్లాడుతూ తనను కట్టడి చేయాలని అనుకుంటున్నారని మైనంపల్లి హనుమంతరావు అన్నారు. కానీ మల్లారెడ్డి అక్రమాలను బయట పెట్టేంత వరకూ తాను పోరాడుతూనే ఉంటానని ఆయన చెప్పారు. మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళనకు తాను మద్దతిచ్చేందుకు మాత్రమే వెళ్లాలనని, వారిని రెచ్చగొట్టలేదని కూడా మైనంపల్లి హనుమంతరావు తెలిపారు.
Next Story

