Fri Dec 05 2025 14:12:24 GMT+0000 (Coordinated Universal Time)
రోడ్డున పడేసిన రేవంత్ సర్కార్... హరీశ్ రావు ఫైర్
రేవంత్ రెడ్డి రైతులను రోడ్డున పడేశారని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హారీశ్ రావు అన్నారు

రేవంత్ రెడ్డి రైతులను రోడ్డున పడేశారని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హారీశ్ రావు అన్నారు. రాష్ట్రంలో వడ్లు కొనే దిక్కే లేదన్న హరీశ్ రావు పంటకు కనీసం మద్దతు ధర దక్కడం లేదన్నారు. కొనుగోలు కేంద్రాలకు వడ్లు తెచ్చి నెలరోజులైనా కొనే నాథుడే లేడని, బోనస్ ఇవ్వరని, రైతు బంధు ఇవ్వరుని హరీశ్ రావు మండిపడ్డారు.
రైతు భరోసా ఏదీ?
రెండు లక్షల రుణమాఫీ కూడా సక్రమంగా చేయలేదన్న ఆయన ఇప్పటి వరకూ రైతులకు రుణమాఫీ జరగలేదని అన్నారు. అలాగే రైతు భరోసా నిధులను కూడా జమ చేయలేదని హరీశ్ రావు ఫైర్ అయ్యారు. ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమన్న హరీశ్ రావు ఇచ్చిన హామీలను అమలు పర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రజలను ఇబ్బంది పెడుతుందన్నారు.
Next Story

