Sun Mar 08 2026 11:50:46 GMT+0530 (India Standard Time)
తెలంగాణ ప్రజలకు విద్యుత్తు షాక్?
తెలంగాణాలో విద్యుత్తు ఛార్జిలను పెంచేందుకు రంగం సిద్ధం చేశారు.

తెలంగాణాలో విద్యుత్తు ఛార్జిలను పెంచేందుకు రంగం సిద్ధం చేశారు. గృహ వినియోగదారులకు యూనిట్ కు యాభై పైసలు చొప్పున పెంచనున్నారు. అలాగే ఇతర వినియోగదారులకు యూనిట్ కు రూపాయి చొప్పున పెంచనున్నారు. ఈ మేరకు డిస్కంల ప్రతిపాదన ప్రభుత్వానికి పంపింది.
త్వరలోనే పెంపు ఉత్తర్వులు...
విద్యుత్ ఛార్జీల పెంపుతో 2,110 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి లభించనుంది. గృహ వినియోగదారులపై పెద్దగా భారం పడకుండా ఛార్జీలను పెంపు ప్రతిపాదనను పంపామన్నారు. ఈ పెంపు ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలపాల్సి ఉంది. నూతన ఏడాది ఛార్జీల బాదుడు ఉండే అవకాశాలున్నాయి.
Next Story

