Wed Jan 21 2026 21:00:16 GMT+0000 (Coordinated Universal Time)
Breaking: గన్తో కాల్చుకుని ఏఎస్సై ఆత్మహత్య
తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎస్కార్ట్ అధికారి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎస్కార్ట్ అధికారి ఆత్మహత్యకు పాల్పడ్డారు. గన్తో కాల్చుకుని ఏఎస్ఐ ఆత్మహత్యకు పాల్పడ్డారు. శ్రీనగర్ కాలనీలోని మణికంఠ హోటల్లో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే విషయం తెలుసుకున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఘటన స్ఠలాన్ని పరిశీలించారు. లోన్ రికవరీ వేధింపులు భరించలేకనే ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఉదయం కూతురిని తీసుకుని డ్యూటీకి వచ్చిన ఫజాన్ అలీ.. కూతురు ముందే గన్తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
Next Story

