Thu Dec 18 2025 13:45:18 GMT+0000 (Coordinated Universal Time)
ఈడీ సోదాలు.. 30 బృందాలతో సోదాలు
హైదరాబాద్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు చేస్తున్నారు. కరీంనగర్ లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నాయి.

హైదరాబాద్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు చేస్తున్నారు. కరీంనగర్ లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నాయి. మొత్తం 30 బృందాలు ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్ మైనింగ్ అక్రమాలపై ఈడీ ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం ఉంది.
గ్రానైట్ తవ్వకాలపై...
గ్రానైట్ అక్రమ తవ్వాకలపై కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక నేతపై ఆరోపణలున్నాయి. హైదరాబాద్, కరీంనగర్ లలో జరుగుతున్న ఈ సోదాలు ఉదయం ప్రారంభమయ్యాయి. ఇంకా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్ లో హైదర్ గూడ, సోమాజిగూడ ఈడీ, ఐటీ సోదాలను నిర్వహిస్తున్నారు.
Next Story

