Thu Mar 19 2026 19:59:55 GMT+0530 (India Standard Time)
నేడు హైకోర్టులో ఐఏఎస్ల క్యాడర్ కేటాయింపుపై?
పదకొండు మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల క్యాడర్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది

పదకొండు మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల క్యాడర్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. క్యాడర్ అలాట్మెంట్ విచారణను చీఫ్ జస్టిస్ బెంచ్ నుంచి రెగ్యులర్ బెంచ్ కు బదిలీ అయిన సంగతి తెలిసిందే. నేడు కేంద్ర ప్రభుత్వం తన వాదనలను వినిపించనుంది. అదనపు సోలిసిటర్ జనరల్ వాదపలను వినిపించనున్నారు.
వాదనలు...
ఇప్పటికే క్యాడర్ అలాట్మెంట్ పై ఒక్కో అధికారికి వ్యక్తిగత ఆర్డర్ జారీ చేసింది. ఐఏఎస్, ఐపీఎస్ అధకారులు తమ తరుపున న్యాయవాదుల ద్వారా వాదనలను వినిపించనున్నారు. సోమేష్ కుమార్ వ్యవహారంలో హైకోర్టు తీర్పు వచ్చిన నేపథ్యంలో వీరిలోనూ ఆందోళన నెలకొంది.
Next Story

