Tue May 21 2024 04:27:30 GMT+0000 (Coordinated Universal Time)
బండి గంట మోగింది
దసరా సెలవులు ముగిశాయి. బడి తలుపులు తెరుచుకున్నాయి. నేటి నుంచి పాఠశాలలు, విద్యాసంస్థలు తిరిగి మొదలు కానున్నాయి
దసరా సెలవులు ముగిశాయి. బడి తలుపులు తెరుచుకున్నాయి. నేటి నుంచి పాఠశాలలు, విద్యాసంస్థలు తిరిగి మొదలు కానున్నాయి. ఉదయం నుంచే ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు దాదాపు పదిహేను రోజుల తర్వాత తెరుచుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో దసరా సెలవులు ముగియడంతో నేటి నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి.
సెలవుల నుంచి...
ఈ నెల 15వ తేదీ నుంచి తెలంగాణ ప్రభుత్వం దసరా సెలవులను ప్రకటించింది. తెలంగాణలో పెద్ద పండగ కావడంతో ఎక్కువ రోజులు ప్రకటించడం ఆనవాయితీగా వస్తుంది. ఏపీలోనూ దాదాపు పన్నెండు రోజుల పాటు స్కూళ్లకు దసరా సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. నేటి నుంచి తిరిగి ప్రారంభం కావడంతో బడి గంటలు మళ్లీ చాలా రోజుల తర్వాత మోగాయి.
Next Story