Fri Dec 05 2025 22:11:16 GMT+0000 (Coordinated Universal Time)
Yadadri : యాదాద్రికి పోటెత్తిన భక్తులు.. స్వామి వారి దర్శనానికి?
యాదాద్రికి భక్తులు పెద్దసంఖ్యలో తరలి వచ్చారు. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది

యాదాద్రికి భక్తులు పెద్దసంఖ్యలో తరలి వచ్చారు. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది. దీనికి తోడు వేసవి సెలవులు కూడా ఉండటంతో అధిక సంఖ్యలో భక్తులు యాదాద్రికి చేరుకుంటున్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకునేందుకు కేవలం తెలంగాణ నుంచి మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు.
పర్యాటకుల తాకిడితో...
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి ప్రస్తుతం నాలుగు గంటల సమయం పడుతుంది. గత కొద్ది రోజులుగా యాదాద్రికి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని పునర్నించిన తర్వాత చూసేందుకు ఎక్కువ మంది భక్తులు ఆసక్తి కనపరుస్తున్నారు. దీంతో భక్తుల రద్దీ పెరుగుతుంది. రోజు వారీ ఆలయ ఆదాయం కూడా అధికంగానే వస్తుందని అధికారులు చెబుతున్నారు.
Next Story

