Tue Jan 20 2026 23:17:11 GMT+0000 (Coordinated Universal Time)
యాదాద్రి ఆదాయం ఎంతంటే?
యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారి దేవాలయానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. ఆదాయం కూడా కోట్లలో వస్తుంది.

యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారి దేవాలయానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. ఆదివారం వచ్చిందంటే చాలు యాదాద్రి కిటకిటలాడిపోతుంది. యాదాద్రి లక్ష్మీనరసింహ ఆలయాన్ని తిరిగి నిర్మించిన తర్వాత భక్తుల సంఖ్య రోజురోజుకూ మరింత పెరుగుతుందని దేవస్థానం అధికారులు చెబుతున్నారు.
వేసవి సెలవుల్లో...
గత ఇరవై రోజుల్లో యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆదాయం కోటి 86 లక్షల 38వేల 644 రూపాయలు అని అధికారులు వెల్లడించారు. విద్యార్థులకు పరీక్షలు పూర్తి కావస్తుండటం, వేసవి సెలవులు ప్రారంభం కానుండటంతో యాదాద్రిలో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశముందని, ఈ మేరకు సౌకర్యాలు కల్పిస్తున్నట్లు దేవాదాయ శాఖ అధికారులు వెల్లడించారు.
Next Story

