Wed Jan 21 2026 05:14:29 GMT+0000 (Coordinated Universal Time)
మునుగోడులో టీఆర్ఎస్ కు సీపీఐ మద్దతు
మునుగోడు ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ కు సీపీఐ మద్దతు తెలిపింది.

మునుగోడు ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ కు సీపీఐ మద్దతు తెలిపింది. ఈరోజు జరిగే సభకు రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సీపీఐ నేతలను కోరారు. మునుగోడు సభకు హాజరు కావాలని సీపీఐ నిర్ణయించింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి సీఎంతో పాటు అదే వాహనంలో మునుగోడు బయలుదేరి వెతతారు.
కేసీఆర్ వెంటనే....
మునుగోడులో కమ్యునిస్టుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సీపీఐ రాష్ట్ర కమిటీ సమావేశమై మునుగోడు ఉప ఎన్నికపై చర్చించింది. బీజేపీ, కాంగ్రెస్ లకు మద్దతివ్వ కూడదని నిర్ణయించింది. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ వాహనంలోనే చాడ వెంకటరెడ్డి మునుగోడు బయలుదేరి వెళతారు.
Next Story

