Tue May 14 2024 20:01:57 GMT+0000 (Coordinated Universal Time)
కళాశాలలో 25 మందికి కరోనా
కరోనా వ్యాప్తి వేగంగా జరుగుతుంది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేరియంట్ విస్తృతంగా వ్యాపిస్తుంది.
కరోనా వ్యాప్తి వేగంగా జరుగుతుంది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేరియంట్ విస్తృతంగా వ్యాపిస్తుంది. తాజాగా రంగారెడ్డి జిల్లాలోని ఒక కళాశాలలో 25 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా తేలింది. గత రెండు రోజులుగా చలి, జ్వరంతో బాధపడుతుండటంతో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. నార్సింగ్ లో ఉన్న ఈ కళాశాలలో ఇరవై ఐదు మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా తేలింది.
కళాశాలలకు సెలవులు....
కళాశాల యాజమాన్యం వెంటనే కళాశాలలో శానిటైజేషన్ నిర్వహించింది. విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని యాజమాన్యం కోరింది. కోవిడ్ పాజిటివ్ వచ్చిన విద్యార్థులను వెంటనే ఐసొలేషన్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. దీంతో కళాశాలల యజమాన్యాలు భయపడిపోతున్నాయి. జనవరి సంక్రాంతి సెలవులు ముందుగానే ఇచ్చేందుకు కొన్ని కళాశాలలు రెడీ అయిపోయాయి.
Next Story