Fri Apr 26 2024 17:14:32 GMT+0000 (Coordinated Universal Time)
చాలా రోజుల తర్వాత తెలంగాణలో కేసులు?
తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. చాలా రోజుల తర్వాత కేసుల సంఖ్య 500 దాటింది
తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. చాలా రోజుల తర్వాత కేసుల సంఖ్య 500 దాటింది. ఒక్కరోజులో 516 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఎవరూ మరణించలేదు. నిన్న ఒక్కరోజులో 434 మంది కరోనా నుంచి కోలుకున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. తెలంగాణలో రికవరీ రేటు 98.89 శాతంగా ఉందని వెల్లడించింది.
నిబంధనలను పాటించుకుంటే...
ఇప్పటి వరకూ తెలంగాణలో 8, 01, 922 కరోనా వైరస్ బారిన పడ్డారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. . వీరిలో 7,93,827 మంది కోలుకున్నారు. కరోనా కారణంగా ఇప్పటి వరకూ తెలంగాణలో 4,111 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 4,784 యాక్టివ్ కేసులున్నాయి. కోవిడ నిబంధనలను పాటించాలని, లేకుంటే కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు హెచ్చరించారు.
Next Story