Tue Mar 19 2024 04:51:37 GMT+0000 (Coordinated Universal Time)
కాంగ్రెస్ లో రచ్చబండ రచ్చ
రేవంత్ రెడ్డి తలపెట్టిన రచ్చబండ కార్యక్రమంపై సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
రేవంత్ రెడ్డి తలపెట్టిన రచ్చబండ కార్యక్రమంపై సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమాలను ఎవరికీ తెలియకుండా రూపొందించడమేంటని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక కార్యక్రమం చేపట్టేముందు ముఖ్యనేతలతో చర్చించకుండా రేవంత్ రెడ్డి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. దీనిపై సీనియర్ నేతలు గుర్రుమంటున్నారు. ముఖ్యంగా వి.హనుమంతరావు, ఎమ్మెల్యే జగ్గారెడ్డిలు బహిరంగంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
హైకమాండ్ కు...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాం హౌస్ ఉన్న ఎర్రవెల్లి ప్రాంతంలో కాంగ్రెస్ కిసాన్ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించాలని డిసైడ్ చేశారు. అయితే ఇది ఎవరికీ తెలయకుండా కార్యక్రమాన్ని రూపొందించారని వి.హనుమంతరావు ఆరోపిస్తున్నారు. కనీసం ఎమ్మెల్యే జగ్గారెడ్డికి కూడా ఈ విషయం తెలియదని, దీనిపై తాను పార్టీ ఇన్ ఛార్జి మాణికం ఠాగూర్ కు ఫిర్యాదు చేస్తానని చెబుతున్నారు. రేవంత్ రెడ్డి అందరినీ కలుపుకుని పోవాలని వి.హనుమంతరావు తెలిపారు.
Next Story