Fri Dec 05 2025 17:52:38 GMT+0000 (Coordinated Universal Time)
Congress : నేడు గాంధీ భవన్ లో కీలక భేటీ
నేడు గాంధీభవన్లో కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ భేటీ కానుంది

నేడు గాంధీభవన్లో కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ భేటీ కానుంది. దీపాదాస్ మున్షీ అధ్యక్షతన పీఏసీ సమావేశం జరుగుతుంది. ముఖ్యఅతిథిగా కేసీ వేణుగోపాల్ హాజరుకానున్నారు. దాదాపు 22 మంది పీఏసీ కమిటీ సభ్యులు ఈ సమావేశానికి వస్తారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు సీనియర్ నేతలు కూడా హాజరు కానున్నారు.
కీలక అంశాలపై...
అయితే ఈ పీఏసీ కమిటీ సమావేశంలో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు, పీసీసీ కమిటీలపై చర్చ జరుగుతుంది. అలాగే తాజా రాజకీయ పరిస్థితులపై కూడా చర్చించనున్నారు. వివిధ రాజకీయ అంశాలతో పాటు పార్టీ, ప్రభుత్వ పదవుల పంపకంపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశముండటంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Next Story

