Sun Feb 01 2026 19:33:37 GMT+0000 (Coordinated Universal Time)
నేడు కాంగ్రెస్ పాదయాత్ర
దేశ వ్యాప్తంగా ధరల పెరుగుదలపై కాంగ్రెస్ పార్టీ నిరసనలు తెలియజేస్తుంది. అనేక చోట్ల పాదయాత్రలను కూడా నిర్వహిస్తుంది.

దేశ వ్యాప్తంగా ధరల పెరుగుదలపై కాంగ్రెస్ పార్టీ నిరసనలు తెలియజేస్తుంది. అనేక చోట్ల పాదయాత్రలను కూడా నిర్వహిస్తుంది. ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ చేెవెళ్ల మండలం ముడిమ్యాల నుంచి చేవెళ్ల వరకూ పాదయాత్ర చేయనున్నారు. జాతీయ కాంగ్రెస్ పిలుపు మేరకు ఈ పాదయాత్ర నిర్వహించనున్నారు.
దిగ్విజయ్ సింగ్....
ఈ పాదయాత్రలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు దిగ్విజయ్ సింగ్ ముఖ్యఅతిధిగా వచ్చి పాల్గొననున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు పలువురు సీనియర్ నేతలు పాల్గొంటారు. తొలుత చిలుకూలరు బాలాజీ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఈరోజు మధ్యాహ్నం పాదయాత్రను కాంగ్రెస్ నేతలు ప్రారంభించనున్నారు.
Next Story

