Fri May 03 2024 12:38:41 GMT+0000 (Coordinated Universal Time)
భట్టిని కలిసిన వైఎస్ షర్మిల
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారిక నివాసానికి కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల వచ్చారు.
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారిక నివాసానికి కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల వచ్చారు. తన కుమారుడు రాజారెడ్డి వివాహ పత్రికను భట్టి విక్రమార్కకు ఇచ్చేందుకు ఆమె ప్రగతి భవన్ కు వచ్చారు. వైఎస్ షర్మిల ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఆమెకు త్వరలోనే ఏపీలో కీలక బాధ్యతలను అప్పగిస్తారన్న ప్రచారం జరుగుతుంది.
వివాహ ఆహ్వాన పత్రికను...
అయితే వైఎస్ షర్మిల మాత్రం తన కుమారుడి వివాహ నిశ్చితార్థం పూర్తయిన తర్వాత ఆమె ఏపీ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటారని సన్నిహితులు చెబుతున్నారు. భట్టి విక్రమార్కను కలిసిన సందర్భంలోనూ ఇరువురూ కలసి తాజా రాజకీయ పరిణామాలపై చర్చించుకున్నారని తెలిసింది. తెలంగాణ, ఏపీలో జరగనున్న లోక్సభ ఎన్నికలపై కూడా చర్చించారని సమాచారం.
Next Story