Fri Dec 05 2025 13:36:48 GMT+0000 (Coordinated Universal Time)
రేపు టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ సమావేశం
జనవరి 30, ఆదివారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. రేపు మధ్యాహ్నం

జనవరి 30, ఆదివారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. రేపు మధ్యాహ్నం 1 గంటకు సీఎం క్యాంప్ కార్యాలయమైన ప్రగతి భవన్ లో ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి రాజ్యసభ, లోక్ సభ కు చెందిన టీఆర్ఎస్ ఎంపీలు హాజరుకానున్నారు. జనవరి 31వ తేదీనుంచి పార్లమెంట్ బడ్జెట్ (2022-23 యూనియన్ బడ్జెట్) సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. సమావేశాల్లో టీఆర్ఎస్ ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం చేయనున్నారు.
అలాగే పార్లమెంట్ లో టీఆర్ఎస్ ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహంపై కూడా చర్చించనున్నారు. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన పెండింగ్ నిధులు, పరిష్కరించాల్సిన సమస్యలపై సీఎం కేసీఆర్ ఎంపీలతో చర్చించనున్నారు. అలాగే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పలు వినతులు చేయగా.. వాటి గురించి కేంద్రాన్ని ప్రశ్నించాలని కేసీఆర్ సూచించనున్నారు. కాగా.. జనవరి 31వ తేదీ నుంచి యూనియన్ బడ్జెట్ 2022-23 సమావేశాలు ప్రారంభమవ్వనుండగా.. ఫిబ్రవరి 1వ తేదీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ పై అన్ని వర్గాల వారు గంపెడాశలు పెట్టుకున్నారు. మరి కేంద్రం ఎవరిని హుషారు చేస్తుందో? ఎవరిని ఉసూరుమనిపిస్తుందో చూడాలి.
Next Story

