Fri Dec 05 2025 18:03:27 GMT+0000 (Coordinated Universal Time)
భూదాన్ భూముల ఆక్రమణలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్
రంగారెడ్డి జిల్లా భూదాన్ భూముల ఆక్రమణలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. విచారణకు ఆదేశించారు

రంగారెడ్డి జిల్లా భూదాన్ భూముల ఆక్రమణలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. రంగారెడ్డి జిల్లా యాచారంలో దాదాపు 250 ఎకరాల భూదాన్ భూములను ఆక్రమించారన్న ఆరోపణలపై రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. ఈ మేరకు వెంటనే ఈ భూదాన్ భూముల ఆక్రమణలపై విచారణ జరిపించాలని కోరారు.
నివేదిక ఇవ్వాలంటూ...
విచారణ జరిపిన వెంటనే తనకు ఈ ఆక్రమణలపై నివేదిక ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భూదాన్ భూములను ఆక్రమించుకోవడంపై ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. ఆక్రమణలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. అధికారులు వెంటనే యాచారంలోని భూ ఆక్రమణలపై విచారణను ప్రారంభించారు.
News Summary - chief minister revanth reddy has become serious about the encroachment of bhoodan lands in yacharam rangareddy district. he has ordered an inquiry
Next Story

