Sat Dec 13 2025 22:33:11 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : కొడంగల్ కు ముఖ్యమంత్రి రేవంత్ వరాలు
కొడంగల్ లో అత్యున్నతమైన విద్యాసంస్థను ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు

కొడంగల్ లో అత్యున్నతమైన విద్యాసంస్థను ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. అందరూ విద్య కోసం కొడంగల్ కు రావాలని అన్నారు. అన్ని రకాల సదుపాయాలతో పాటు కార్పొరేట్ తరహాలో విద్యను అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కొడంగల్ లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కొడంగల్ లో సైనిక్ స్కూల్ ను ఏర్పాటు చేస్తున్నామని, విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఆహారాన్ని కూడా అందించనున్నామని చెప్పారు. పదహారు నెలల్లో సైనిక్ స్కూల్ నిర్మాణం పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
కృష్ణా నీళ్లు, రైలు..
కొడంగల్ అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లగచర్ల రైతులను ఒప్పించి ఇక్కడ పరిశ్రమలను ఏర్పాటు చేసి వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. కొడంగల్ అభివృద్ధికి అడ్డుపడే వారిని అడ్డుకోవాలని పిలుపు నిచ్చారు. కొడంగల్ నియోజకవర్గానికి త్వరలో కృష్ణానీటిని తెస్తామని, అలాగే ఈ ప్రాంత ప్రజలు ఏడు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న రైలు కూడా వచ్చే ఏర్పాట్లు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రజలు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి నేతను ఎన్నుకోవాలని, ప్రభుత్వానికి సహకరిస్తూ కొడంగల్ నియోజకవర్గం అభివృద్ధికి తోడ్పడాలని పిలుపు నిచ్చారు.
Next Story

