Sat Dec 06 2025 01:51:58 GMT+0000 (Coordinated Universal Time)
ప్రొసీజర్ ప్రకారమే ఫలితాలు
ఫలితాలు ప్రకటించడానికి ఒక ప్రొసీజర్ ఉంటుందని చీఫ్ ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు

ఫలితాలు ప్రకటించడానికి ఒక ప్రొసీజర్ ఉంటుందని చీఫ్ ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి జాప్యం జరగలేదని ఆయన తెలిపారు. అది పార్టీల అపోహలు మాత్రమేనని ఆయన అన్నారు. తొలి నాలుగు రౌండ్లు వెంటనే ఫలితాలు వెలువడినా, ఐదో రౌండ్ ఆలస్యం కావడంపై పలు పార్టీలు అభ్యంతరం చెబుతున్నాయి.
ఐదో రౌండ్ లో టీఆర్ఎస్ ....
బీజేపీ దీనిపై సీరియస్ అయింది. ప్రస్తుతం ఐదో రౌండ్ పూర్తయ్యేసరకి 1,631 ఓట్ల మెజారిటీతో టీఆర్ఎస్ ఉంది. బీజేపీ వెనుకంజలో ఉంది. కాంగ్రెస్ ఈ ఉప ఎన్నికలోనూ పెద్దగా ఓట్లను సాధించలేకపోయింది. టీఆర్ఎస్, బీజేపీల మధ్య మాత్రం హోరాహోరీగా పోరు కొనసాగుతుంది.
Next Story

