Chandrababu: మూడేళ్లలో అమరావతి రూపురేఖలే మారనున్నాయి : చంద్రబాబు
ప్రస్తుత పరిస్థితుల్లో మెరుగైన బడ్జెట్ ప్రవేశపెట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు

ప్రస్తుత పరిస్థితుల్లో మెరుగైన బడ్జెట్ ప్రవేశపెట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.అసెంబ్లీ లాబీలో మీడియాతో ముఖ్యమంత్రి చంద్రబాబు చిట్ చాట్ చేశారు. . వైసీపీ విధ్వంసం నుంచి కోలుకోవడానికి ఇంకా సమయం పడుతుందని, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయని, ఇప్పుడిప్పుడే ట్రాక్ ఎక్కుతున్నామని తెలిపారు. ఆదాయం తక్కువ-ఖర్చులు ఎక్కువ అనేది వారసత్వంగా వచ్చింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాం. వ్యవసాయం నుంచి ఎక్కువ ఆదాయం రావాలని, సేవా రంగంలోనూ ఆదాయం పెరగాలని చంద్రబాబు అన్నారు. ఒంగోలు పాలకు... అనంతపురం పండుకు బహిరంగ మార్కెట్టులో ఎంతో డిమాండ్ ఉందని, దేశంలోనే ఉత్తమమైన పండ్లు రాయలసీమ నుంచి వస్తున్నాయని, అక్కడ పండే దానిమ్మకు మంచి డిమాండ్ ఉందని చంద్రబాబు చెప్పారు. రాయలసీమ ముఖచిత్రం మార్చింది తామేనని, రాయలసీమ హార్టీకల్చర్ హబ్ కు రూ. 30 వేల కోట్లు కేటాయించడంతో ఎమ్మెల్యేలు అంతా సంతోషంగా ఉన్నారని తెలిపారు. రెండు మూడేళ్ళలో అమరావతికి ఒక రూపు వస్తుందని, అమరావతి దారుల్ని జాతీయ రహదారికి అనుసంధానిస్తున్నామని, అమరావతికి రాకపోకలు పెరిగి ఆదాయమూ వస్తుందని చంద్రబాబు తెలిపారు. పశ్చిమ బైపాస్ వల్ల యాక్సిస్ పెరిగిందని, ఇన్నర్ రింగ్, ఔటర్ రింగ్ వల్ల ఇంకా యాక్సిస్ పెరుగుతుందని చంద్రబాబు అన్నారు. హైదరాబాద్ లో ఒకప్పుడు జూబ్లీహిల్స్ దాటితే మొత్తం అడవిలా ఉండేదని,

