Wed Jan 21 2026 03:30:37 GMT+0000 (Coordinated Universal Time)
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో చండీయాగం
హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో చండీయాగాన్ని నిర్వహిస్తున్నారు

హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో చండీయాగాన్ని నిర్వహిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో ఏపీ, తెలంగాణలో పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఈ యాగాన్ని నిర్వహిస్తున్నారని తెలిసింది. అందుకే పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ యగాన్ని నిర్వహిస్తున్నారని చెబుతున్నారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ నేతృత్వంలో చండీయాగాన్ని వేద పండితులు నిర్వహిస్తున్నారు.
ముగింపు రోజు...
ఈ చండీయాగానికి తెలంగాణకు చెందిన ముఖ్యనేతలు హాజరయ్యారు. రావుల చంద్రశేఖర్ రెడ్డి, అరవిందకుమార్ గౌడ్ లు చండీ యాగానికి హాజరయ్యారు. చండీయాగం ముగింపు రోజున పార్టీ అధినేత చంద్రబాబు హాజరయ్యే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Next Story

