Mon Mar 16 2026 08:46:13 GMT+0530 (India Standard Time)
రంజాన్ రోజూ విచారణ
వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు రంజాన్ రోజు కూడా విచారణ కొనసాగిస్తున్నారు

వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు రంజాన్ రోజు కూడా విచారణ కొనసాగిస్తున్నారు. నాలుగో రోజు వైఎస్ భాస్కర్ రెడ్డి , ఉదయ్ కుమార్ లను సీబీఐ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. గత మూడు రోజుల నుంచి కడప ఎంపీ అవినాష్ రెడ్డిని కూడా విచారిస్తున్న అధికారులు ఈ నెల 25వ తేదీ వరకూ విచారణ కొనసాగించాలని నిర్ణయించుకున్నారు.
సీబీఐ అధికారులు
చంచల్గూడ జైలు నుండి ఇద్దరినీ సీబీఐ కార్యాలయానికి తరలించిన సీీీబీఐ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. సాయంత్రం వరకు విచారణ కొనసాగుతుందని సమాచారం. ఈ నెల 24వ తేదీ వరకూ సుప్రీంకోర్టు కూడా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని చెప్పడంతో ఆరోజు విచారణలో ఏం జరగనుందోనన్న టెన్షన్ వైసీపీ నేతల్లో నెలకొంది.
Next Story

