Thu Jan 29 2026 08:30:41 GMT+0000 (Coordinated Universal Time)
నేడు సుప్రీంలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సీబీఐ విచారణ నేడు సుప్రీంకోర్టులో జరగనుంది.

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సీబీఐ విచారణ నేడు సుప్రీంకోర్టులో జరగనుంది. ఎమ్మెల్యే కొనుగోలు కేసును సీబీఐకి అప్పగించాలంటూ ఇప్పటికే హైకోర్టు సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్ తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టును ప్రభుత్వం ఆశ్రయించింది. దీనిపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.
హైకోర్టు ఇచ్చిన తీర్పుతో...
హైకోర్టు ఇచ్చిన తీర్పుతో తమకు ఎమ్మెల్యేల కొనుగోలు కేసు వివరాలను అందించాలని ఇప్పటి వరకూ ఐదు సార్లు సీబీఐ ప్రభుత్వానికి లేఖ రాసింది. అయినా ప్రభుత్వం నుంచి సీబీఐకి ఎలాంటి సమాచారం అందలేదు. సుప్రీంకోర్టులో కేసు విషయం తేలేవరకూ వివరాలను అందించకూడదని ప్రభుత్వం భావించినట్లుంది. సుప్రీంకోర్టులో నేడు జరిగే విచారణలో తేలితే ఈ కేసు సీబీఐ విచారిస్తుందా? లేదా అన్నది తేలనుంది.
Next Story

