Fri Dec 05 2025 11:36:28 GMT+0000 (Coordinated Universal Time)
KTR : కేటీఆర్ కు మహిళా కమిషన్ నోటీసులు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు రాష్ట్ర మహిళ కమిషన్ నోటీసులు జారీ చేసింది.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు రాష్ట్ర మహిళ కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 24వ తేదీన కమిషన్ ఎదుట విచారణకు హాజరవ్వాలని నోటీసులలో పేర్కొంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళల ప్రయాణంపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న నేపథ్యంలో మహిళ కమిషన్ సుమోటా కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది.
24న హాజరు కావాలంటూ...
ఆర్టీసీ బస్సుల్లో కుట్లు, అల్లికలే కాదు బ్రేక్ డ్యాన్స్లు వేసుకుంటే తమకెందుకున్న కేటీఆర్ వ్యాఖ్యలను మహిళ కమిషనర్ సీరియస్ గా తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర మహిళ కమిషన్ ఛైర్ పర్సన్ నేరెళ్ల శారద ఈమేరకు నోటీసులు జారీ చేశారు. అయితే కేటీఆర్ ఇప్పటికే తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నట్లు ఎక్స్ లో ప్రకటించారు. నొచ్చుకుంటే క్షమించాలని కోరారు. మహిళలంటే తమకు గౌరవమని తెలిపారు. అయినా మహిళ కమిషన్ నోటీసులు జారీ చేసింది
Next Story

