Tue Feb 18 2025 12:49:40 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : హైకోర్టులో కేసీఆర్ కు రిలీఫ్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయన పై భూపాలపల్లి కోర్టు జారీ చేసిన నోటీసులను కొట్టి వేసింది

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయన పై భూపాలపల్లి కోర్టు జారీ చేసిన నోటీసులను సస్పెండ్ చేసింది. మేడిగడ్డ బ్యారేజీలో అవకతవలకు జరిగాయంటూ పోలీసు కేసు నమోదయింది. ఈ కేసు నేపథ్యంలో భూపాలపల్లి న్యాయస్థానం కేసీఆర్ తో పాటు, మాజీ మంత్రి హరీశ్ రావు లకు నోటీసులు జారీ చేసింది.
క్వాష్ చేయాలని...
దీనిపై కేసీఆర్, హరీశ్ రావులు హైకోర్టును ఆశ్రయించారు. తమపై జారీ అయిన నోటీసును క్వాష్ చేయాలని పిటీషన్ వేశారు. దీనిపై విచారించిన హైకోర్టు భూపాలపల్లి కోర్టు జారీ చేసిన నోటీసును కొట్టివేసింది. దీంతో ఈ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు లకు హైకోర్టులో ఊరట లభించినట్లయింది.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Next Story