Sat Dec 20 2025 12:21:10 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : అసద్ పై అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హైదరాబాద్ పార్లమెంటుకు గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేరును ఖరారు చేశారు

హైదరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిని పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హైదరాబాద్ పార్లమెంటుకు గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేరును ఖరారు చేశారు. హైదరాబాద్ పార్లమెంటు నుంచి గడ్డం శ్రీనివాస్ పోటీ చేయనున్నట్లు కేసీఆర్ తెలిపారు. హైదరాబాద్ పార్లమెంటు అంటే ఎంఐఎం కు కంచుకోట. కొన్ని దశాబ్దాలుగా హైదరాబాద్ ఎంపీగా అసదుద్దీన్ ఒవైసీ గెలుస్తూ వస్తున్నారు.
గడ్డం శ్రీనివాస్ యాదవ్ను...
హైదరాబాద్ సీటులో ఈసారి బీజేపీ కూడా కొంపల్లి మాధవీలత పేరును ఖరారు చేసింది. ఈనేపథ్యంలో అసద్ కు పోటీగా గడ్డం శ్రీనివాస్ యాదవ్ ను బరిలోకి దింపాలని కేసీఆర్ నిర్ణయించారు. ఇప్పటికే అనేక స్థానాలను ప్రకటించిన కేసీఆర్ హైదరాబాద్ స్థానంలో అభ్యర్థి విషయంలో మాత్రం కొంచెం ఆలస్యంగా ప్రకటించారు.
Next Story

