Sun May 12 2024 03:32:44 GMT+0000 (Coordinated Universal Time)
ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి
ఎదురుగా వస్తోన్న లారీని బొలెరో వాహనం ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. షాద్ నగర్ పరిధిలోని సోలిపూర్..
రంగారెడ్డి జిల్లాలో శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మరణించగా.. మరొకరు తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎదురుగా వస్తోన్న లారీని బొలెరో వాహనం ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. షాద్ నగర్ పరిధిలోని సోలిపూర్ గ్రామ శివారులో జరిగిన ఈ ప్రమాదం ఒక వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఇన్ స్పెక్టర్ నవీన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..
శనివారం ఉదయం బెంగళూరు జాతీయ రహదారిపై హైదరాబాద్ నుంచి కర్నూల్ వైపు వెళ్తోన్న బొలెరో వాహనం అదుపుతప్పి డివైడర్ ను దాటి ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మరణించగా.. మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన మరొక వ్యక్తిని ఉస్మానియాకు తరలించగా అక్కడ వైద్యులు చికిత్స చేస్తున్నారు. మృతులు, క్షతగాత్రుడిని వనపర్తి జిల్లా పెబ్బేరు ప్రాంతానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.
Next Story