Fri Jan 30 2026 00:38:32 GMT+0000 (Coordinated Universal Time)
21న అమిత్ షా సభ... బండి స్పష్టీకరణ
మునుగోడు సభ వాయిదా పడిందంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు

మునుగోడు సభ వాయిదా పడిందంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. ఈ నెల 21వ తేదీన మునుగోడు నియోజకవర్గంలో బహిరంగ సభ జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా హాజరుకానున్నారని ఆయన చెప్పారు. 21వ తేదీన సభ వాయిదా పడిందంటూ కొందరు చేస్తున్న ప్రచారంలో నిజం లేదన్నారు.
పలు తేదీలు సూచించినా...
మునుగోడు సభకు రావాలని అమిత్ షాను తాము కోరామన్నారు. ఈ నెల 21, 29 తేదీలతో పాటు సెప్టంబరు నెలలో మరో రెండు తేదీలను అమిత్ షాకు తాము సూచించామని చెప్పారు. అయితే అమిత్ షా మాత్రం ఈ నెల 21న బహిరంగ సభకు వచ్చేందుకు అంగీకరించారని బండి సంజయ్ తెలిపారు.
Next Story

