Sun Feb 01 2026 09:53:13 GMT+0000 (Coordinated Universal Time)
కేసీఆర్ అనారోగ్యం పట్ల ఆందోళనకు గురయ్యా
కేసీఆర్ అనారోగ్య సమాచారం కొంత ఆందోళనకు గురిచేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.

కేసీఆర్ అనారోగ్య సమాచారం కొంత ఆందోళనకు గురిచేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. త్వరగా కోలుకుని కేసీఆర్ విధుల్లో పాల్గొనాలని బండి సంజయ్ ఆకాంక్షించారు.
టెస్ట్ లలో...
కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయి యశోదా ఆసుపత్రికి వచ్చిన సంగతి తెలిసిందే. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. యాంజియోగ్రామ్ పరీక్షలో నార్మల్ గా ఉన్నట్లు తేలింది. కేసీఆర్ ఆరోగ్యంపై తొలుత ఆందోళన వ్కక్తమయినా వైద్యులు వెల్లడించిన తర్వాత టీఆర్ఎస్ శ్రేణులకు కొంత ఊరట కల్గించింది.
Next Story

