Fri Dec 05 2025 17:10:08 GMT+0000 (Coordinated Universal Time)
మల్లారెడ్డి సెల్ఫోన్ చెత్తబుట్టలో ఎందుకు?
మల్లారెడ్డి తన సెల్ ఫోన్ ను చెత్త బుట్టలో ఎందుకు దాచిపెట్టాల్సి వచ్చిందని బీేజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు

మంత్రి మల్లారెడ్డి తన సెల్ ఫోన్ ను చెత్త బుట్టలో ఎందుకు దాచిపెట్టాల్సి వచ్చిందో చెప్పాలని బీేజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు. లొసుగులు ఉండబట్టే ఐటీ శాఖ అధికారులకు దాడులకు భయపడి సెల్ ఫోన్ ను దాచి పెట్టారన్నారు. చట్టం ముందు అందరూ సమానులేనని ఆయన అన్నారు.
తప్పుడు లెక్కలు...
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరిపైనా ఆదాయపు పన్ను శాఖ దాడులు జరగడం లేదు కదా? అని ఆయన ప్రశ్నించారు. ఆదాయాన్ని చూపకుండా తప్పుడు లెక్కలు చేసే వారిపైనే ఐటీ దాడులు జరుగుతాయని ఆయన అన్నారు. మల్లారెడ్డి వెంట ఉన్న వారే ఐటీ శాఖకు సమాచారం ఇచ్చి ఉండవచ్చని రఘునందన్ అభిప్రాయపడ్డారు. ఇదేమీ కక్ష సాధింపు చర్య కాదని, ప్రభుత్వానికి ఎగ్గొట్టిన సొమ్మును రాబట్టేందుకే ఈ దాడులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.
Next Story

