Sat Mar 07 2026 23:41:04 GMT+0530 (India Standard Time)
వారికి బీఎల్ సంతోష్ వార్నింగ్
మొయినాబాద్ ఫాంహౌస్ లో ఎమ్మెల్యేల ఎర కేసుపై బీజేపీ నేత బీఎల్ సంతోష్ స్పందించారు.

మొయినాబాద్ ఫాంహౌస్ లో ఎమ్మెల్యేల ఎర కేసుపై బీజేపీ నేత బీఎల్ సంతోష్ స్పందించారు. తనపై చేసిన ఆరోపణలకు వారే సమాధానం చెప్పాలన్నారు. తన పేరు తెలంగాణలో ఎవరికీ తెలియదన్నారు. ప్రతి ఇంటికి తన పేరు చేర్చారని బీఎల్ సంతోష్ అన్నారు. తనపై ఆరోపణలు చేసిన వారు పర్యావసనాలు ఎదుర్కొనక తప్పదని హెచ్చరించారు.
ప్రజలకు శాపం...
హైదరాబాద్ సంపదను తమ రాజకీయ అవసరాల కోసం దేశమంతా పంపుతున్నారని అన్నారు. తెలంగాణ తల్లికి కూడా ద్రోహం చేశారని బీఎల్ సంతోష్ ఆరోపించారు. ఇక్కడున్న ప్రభుత్వం, నాయకులు ప్రజస్వామ్యానికి శాపం అని అన్నారు.
Next Story

