Fri Dec 05 2025 23:12:10 GMT+0000 (Coordinated Universal Time)
నేడు బీజేపీ ఆందోళన
తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్తు ఛార్జీల పెంపుదలకు నిరసనగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆందోళనలు చేయాలని నిర్ణయించింది.

తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్తు ఛార్జీల పెంపుదలకు నిరసనగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆందోళనలు చేయాలని నిర్ణయించింది. విద్యుత్తు ఛార్జీలను పెంపుదల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో నిరసన కార్యక్రమాలను చేపట్టాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
పోటాపోటీగా...
తెలంగాణలో అధికార టీఆర్ఎస్, బీజేపీలు పోటాపోటీగా ఆందోళనలకు దిగుతుండటం చర్చనీయాంశంగా మారింది. నిన్న పెట్రోలు ధరల పెంపుదలకు నిరసనగా టీఆర్ఎస్ ఆందోళన చేస్తే, నేడు విద్యుత్తు ఛార్జీల పెంపుదల నిర్ణయానికి వ్యతిరేకంగా బీజేపీ నిరసనలకు దిగనుంది.
Next Story

