Sat Dec 06 2025 01:06:11 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : నేడు పాఠశాలల బంద్ కు పిలుపు
తెలంగాణలో నేడు పాఠశాలల బంద్ కు భారతీయ జనతా పార్టీ విద్యార్థి అనుబంధ విభాగం ఏబీవీపీ పిలుపు ఇచ్చింది

తెలంగాణలో నేడు పాఠశాలల బంద్ కు భారతీయ జనతా పార్టీ విద్యార్థి అనుబంధ విభాగం ఏబీవీపీ పిలుపు ఇచ్చింది. పాఠశాలల్లో విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏబీవీపీ పాఠశాలల బంద్ కు నేడు ఏబీవీపీ పిలుపు ఇచ్చింది. ప్రయివేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ చేయాలని, అందులో ప్రభుత్వం విఫలమయిందని ఏబీవీపీ ఆరోపించింది.
మౌలిక సదుపాయాలు...
ఇదే సమయంలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, పాఠశాలల్లో ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయాలంటూ ఏబీవీపీ ప్రధాన డిమాండ్ తో నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఏబీవీపీ పాఠశాలల బంద్ కు పిిలుపునిచ్చింది. ప్రభుత్వం వెంటనే తమ డిమాండ్లను పరిష్కరించాంటూ నేడు నిరసనకు దిగనుంది.
Next Story

