Thu Mar 19 2026 07:18:49 GMT+0530 (India Standard Time)
Telangana : విహారి ట్రావెల్స్ బస్సు మంటల్లో
తెలంగాణలో మరొక ప్రయివేటు ట్రావెల్స్ బస్సు దహనమయింది

ప్రయివేటు ట్రావెల్స్ బస్సుల్లో ప్రయాణం నరకానికి దారులుగా మారుతున్నాయి. తెలంగాణలో మరొక ప్రయివేటు ట్రావెల్స్ బస్సు దహనమయింది. అయితే ఈ ప్రమాదంలో ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. విహారీ ట్రావెల్స్ కు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి కందుకూరు వెళుతుండగా నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి వద్ద ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.
ప్రయాణికులు సురక్షితం...
హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరగడంతో అక్కడ ట్రాఫిక్ చాలా సేపు నిలిచిపోయింది. అయితే బస్సుకు మంటలు అంటుకున్న వెంటనే ప్రయాణికులు కిటికీ అద్దాలు పగుల కొట్టుకుని కిందకు దిగారు. దీంతో ఎవరూ ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోలేదు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. బస్సు పూర్తిగా దగ్దమైంది. ప్రమాదం సమయంలో బస్సులో 29 మంది ప్రయాణికులున్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

