Fri Dec 05 2025 21:38:47 GMT+0000 (Coordinated Universal Time)
Pawan Kalyan : 29న కొండగట్టుకు పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొండట్టు ఆంజనేయ స్వామిని దర్శించు కోనున్నారు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొండట్టు ఆంజనేయ స్వామిని దర్శించు కోనున్నారు. ఈ నెల 29వ తేదీన పవన్ కల్యాణ్ కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకుంటారు. కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుని పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ వారాహి అమ్మవారి ఉపాసనలో ఉన్నారు.
వారాహి యాత్రను...
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ముందు వారాహియాత్రను కొండగట్టు ఆంజనేయ స్వామి వద్దనే వాహనానికి పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత పవన్ కల్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
Next Story

