Fri Dec 05 2025 10:27:27 GMT+0000 (Coordinated Universal Time)
ముత్యాలమ్మ దేవత విగ్రహాన్ని అపవిత్రం.. జ్యుడీషియల్ రిమాండ్కు నిందితుడు
సికింద్రాబాద్లోని ముత్యాలమ్మ దేవత విగ్రహాన్ని అపవిత్రం చేసిన

సికింద్రాబాద్లోని ముత్యాలమ్మ దేవత విగ్రహాన్ని అపవిత్రం చేసిన కేసులో నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. నవంబర్ 2 శనివారం జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మహారాష్ట్రకు చెందిన సల్మాన్ సలీం ఠాకూర్ గతంలో ముంబైలో కూడా ఇలాంటి నేరాలకు పాల్పడిన నేర చరిత్ర ఉంది. నిందితుడు సికింద్రాబాద్లోని మెట్రోపాలిస్ హోటల్ బిల్డింగ్లో ఉన్న ఇంగ్లీష్ హౌస్ అకాడమీ ఈవెంట్ కు హాజరయ్యేందుకు హైదరాబాద్ వచ్చారు.
అక్టోబర్ 14వ తేదీ తెల్లవారుజామున నిందితుడు సల్మాన్ సలీం ఠాకూర్ కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ ఆలయంలోని తాళం పగులగొట్టి లోపలికి చొరబడి దేవతా విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. సలీం చేసిన పనులను గమనించిన స్థానికులు అతడు పారిపోతుండగా అడ్డుకోగా, తోపులాటలో అతనికి గాయాలయ్యాయి. అనంతరం చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గాయాల నుండి కోలుకున్న తర్వాత, పోలీసులు నవంబర్ 1న అరెస్టు చేసి, శనివారం అతన్ని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
Next Story

