Thu Dec 18 2025 17:57:20 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : మాజీ ఈఎన్సీ ఇళ్లలో ఏసీబీ దాడులు
తెలంగాణ మాజీ ఈఎన్సీ హరిరాం ఇళ్లు, ఆయన బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు

తెలంగాణలో నీటిపారుద శాఖ మాజీ ఈఎన్సీ ఇళ్లలో అవినీతి నిరోధక శాఖ అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ మాజీ ఈఎన్సీ హరిరాం ఇళ్లు, ఆయన బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు ఈ రోజు తెల్లవారు జాము నుంచి తనిఖీలు చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో హరిరాం కీలకంగా వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి.
కాళేశ్వరం మార్కెట్ లో...
ఈ నేపథ్యంలోనే మాజీ ఈఎన్సీ హరిరాం ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేసి తనిఖీలు చేస్తున్నారు. కీలక పత్రాల కోసం గాలిస్తున్నారు. ఉదయం ఐదు గంటల నుంచి ఈ తనిఖీలు ప్రారంభం కావడంతో పాటు ఆయన సన్నిహితుల ఇళ్లలోనూ ఏసీబీ అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story

