Tue May 21 2024 02:22:50 GMT+0000 (Coordinated Universal Time)
మునుగోడులో భారీగా నామినేషన్లు
మునుగోడు ఉప ఎన్నికల్లో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. 119 మంది అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు
మునుగోడు ఉప ఎన్నికల్లో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. నిన్న నామినేషన్లు ముగిసే సమయానికి 119 మంది అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. 187 సెట్ల నామినేషన్లు దాఖలయినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 17వ తేదీ వరకూ నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంది. ప్రధాన పార్టీ అభ్యర్థులైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, పాల్వాయి స్రవంతి లు నామినేషన్లు దాఖలు చేశారు.
జోరందుకున్న ప్రచారం...
వీరితో పాటు ప్రజాశాంతి పార్టీ తరుపున గద్దర్, బీఎస్పీ, కోదండరామ్ పార్టీ అభ్యర్థులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. బరిలో ఎక్కువ మంది అభ్యర్థులు ఉంటారని తెలుస్తోంది. మరో వైపు ఉప ఎన్నికల ప్రచారం కూడా ఊపందుకుంది. ప్రధాన పార్టీలన్నీ ప్రతి ఓటరు ముందుకు వెళ్లి తమను ఆశీర్వదించాలని అభ్యర్థిస్తున్నాయి.
Next Story