Sat Mar 14 2026 19:04:19 GMT+0530 (India Standard Time)
Breaking : మెదక్ జిల్లాలో బైకుపై ప్రయాణిస్తున్న ముగ్గురి మృతి
మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది

మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం రాంపూర్ వద్ద జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సును ఒక బైకు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకుపై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు మరణించారని పోలీసులు తెలిపారు. మృతులు ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. తండ్రీ కొడుకులు, చిన్నారి ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఆర్టీసీ బస్సును ఢీకొని...
నర్సాపూర్ నుంచి హైదరాబాద్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. అతి వేగంతో వస్తూ ఆర్టీసీ బస్సును వేగంగా ఢీకొట్టడ వల్లనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు. మృతులు ముగ్గురూ మెదక్ జిల్లా వాసులుగానే గుర్తించారు. పోలీసులు మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story

