Revanth Reddy : నేను రాజకీయాల్లో ఉన్నంత వరకూ కేసీఆర్ కుటుంబాన్ని అధికారంలోకి రానివ్వను
పదేళ్లలో కేసీఆర్ ఏ ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు

పదేళ్లలో కేసీఆర్ ఏ ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కోస్గిలో జరిగిన సర్పంచ్ లతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ను తానేమీ అనలేదని, తాను ఆయనపై కేసులు పెడతానని కూడా చెప్పలేదన్నారు. పదేళ్లు బీఆర్ఎస్ రాష్ట్రానికి అన్యాయం చేసిందన్నారు. పాలమూరు ప్రజలు పదేళ్ల పాటు నిర్లక్ష్యానికి గురయ్యారని రేవంత్ రెడ్డి చెప్పారు. పదేళ్లలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని చెప్పారు. తనను జైలుకు పంపాడని, తన కుటుంబ సభ్యులను వేధించాడని రేవంత్ రెడ్డి అన్నారు. ఎవరి తోలు తీస్తావో చూద్దాం రా అని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. రెండేళ్లలో ఫామ్ హౌస్ లో తోలు తీసుడు కార్యక్రమాన్ని నేర్చుకున్నాడన్నారు. కేసీఆర్ వలస వచ్చి పాలమూరు ఎంపీగా అయ్యారన్న కేసీఆర్ రెండేళ్ల తర్వాత కేసీఆర్ బయటకు వచ్చారని తెలిపారు. ఆయన పాపాలకు ఆయనే పోతాడని నేనేమీ అనలేదన్నారు. తాను ప్రమాణ స్వీకారం చేసిన రోజునే మంచం మీద పడి మక్కెలిరగొట్టుకున్నారని కేసీఆర్ అన్నారు.

