Thu Jan 08 2026 18:18:47 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : చిరు, ప్రభాస్ సినిమా లకు హైకోర్టులో ఊరట
మెగాస్టార్ చిరంజీవి, రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలకు హైకోర్టులో ఊరట లభించింది.

మెగాస్టార్ చిరంజీవి, రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలకు హైకోర్టులో ఊరట లభించింది. నిర్మాతల వినతులను పరిశీలించాలని రాష్ట్ర హోంశాఖ కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులు నాటి సినిమాలయిన ఓజీ, పుష్ప 2, అఖండ 2, గేమ్ చేంజర్ సినిమాలకే వర్తిస్తాయని తెలిపింది. మనశంకరవరప్రసాద్, రాజాసాబ్ టిక్కెట్ల రేట్ల పెంపుపై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.
టిక్కెట్ల రేట్లు పెంచుకోవడానికి...
సంక్రాంతికి విడుదల కానున్న తమ సినిమాలకు సంబంధించి టిక్కెట్ల రేట్లను పెంచుకునేలా ఆదేశాలివ్వాలని వేసిన పిటీషన్ పై నేడు హైకోర్టులో విచారించింది. సంక్రాంతికి చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారూ, ప్రభాస్ నటించిన రాజా సాబ్ విడుదలవుతున్న నేపథ్యంలో నిర్మాతలు హైకోర్టును ఆశ్రయించారు.టిక్కెట్ ధరలతో పాటు ప్రత్యేక షోలకు అనుమతివ్వాలని కోరారు. టిక్కెట్ ధరలు పెంచకూడదని సింగిల్ జడ్జి జారీ చేసిన ఉత్తర్వులను నిర్మాతలు హైకోర్టులో సవాల్ చేశారు. ఇప్పటికే ప్రత్యేక షోలకు, టిక్కెట్ ధరలను పెంచుకోవడానికి అనుమతివ్వాలని హోంశాఖ కార్యదర్శికి దరఖాస్తు చేసుకున్నామని తెలిపారు. దీనిపై నేడు హైకోర్టులో రెండు సినిమాలకు ఊరల లభించింది.
Next Story

