Wed Dec 17 2025 08:42:52 GMT+0000 (Coordinated Universal Time)
Bjp : బీజేపీ తుది జాబితా విడుదల.. 14 మంది పేర్లను విడుదల చేసిన హైకమాండ్
భారతీయ జనతా పార్టీ తుది జాబితాను విడుదల చేసింది. పథ్నాలుగు మందితో కూడిన అభ్యర్థుల జాబితాను ఖరారు చేసింది

భారతీయ జనతా పార్టీ తుది జాబితాను విడుదల చేసింది. పథ్నాలుగు మందితో కూడిన అభ్యర్థుల జాబితాను ఖరారు చేసింది. నామినేషన్లకు చివరి రోజున ఈ పథ్నాలుగు మంది అభ్యర్థులను ఖరారు చేస్తూ బీజేపీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ 100 స్థానాలకు నాలుగు విడతలుగా జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పొత్తులో ఉన్న జనసేనకు ఎనిమిది స్థానాలను కేటాయించింది. మల్కాజ్గిరికి రామచంద్రరావు పేరును ఖరారు చేసింది.
01. కంటోన్మెంట్ - గణేశ్ నారాయణ
02. సంగారెడ్డి - రాజేశ్వరరావు
03. మేడ్చల్ - సుదర్శన్ రెడ్డి
04. నాంపల్లి - రాహుల్ చంద్ర
05. మల్కాజ్గిరి - రామచంద్రారావు
06. అలంపూర్ - మేరమ్మ
07. దేవరకద్ర - కొండా ప్రశాంత్ రెడ్డి
08. చంద్రాయణగుట్ట - కె. మహేందర్
09. వనపర్తి - అనుగ్న రెడ్డి
10. నర్సంపేట - కొల్లారావు
11. బెల్లంపల్లి - కోయల ఎమాజీ
12. మధరి - పి. విజయరాజు
13. పెద్దపల్లి - దుగ్యాల ప్రదీప్
14. శేరిలింగంపల్లి - రవికుమార్ యాదవ్
Next Story

