Wed May 22 2024 02:17:37 GMT+0000 (Coordinated Universal Time)
Congress : రేపు మ్యానిఫేస్టో విడుదల.. ఖర్గే చేతుల మీదుగా
రేపు కాంగ్రెస్ మ్యానిఫేస్టోను ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే విడుదల చేయనున్నారు
తెలంగాణ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతుంది. ఇంకా ప్రచారానికి పన్నెండు రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ నెల 30వ తేదీన పోలింగ్ కావడంతో 28వ తేదీ రాత్రి నుంచే ప్రచారాన్ని ముగించాల్సి ఉంటుంది. మిగిలిన పన్నెండు రోజుల్లో ప్రజల వద్దకు వెళ్లాలి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను ప్రకటించింది. అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా ఆరు గ్యారంటీలను నియోజకవర్గాల్లో తిరుగుతూ నేతలు ప్రజల్లోకి బలంగా తీసుకెళుతున్నారు. ఆరు గ్యారంటీలను తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని హామీ ఇస్తున్నారు.
ఇప్పటికే ఆరు గ్యారంటీలు...
మరోవైపు రేపటి నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు కూడా రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. అయితే రేపు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కూడా రాష్ట్రానికి రానున్నారు. ఆయన కూడా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం ఆయన కాంగ్రెస్ మ్యానిఫేస్టోను విడుదల చేయనున్నారు. ఆరు గ్యారంటీలతో పాటు మ్యానిఫేస్టోను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేలా నేతలు ప్లాన్ చేుకుంటున్నారు. మొత్తం మీద కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ఇప్పటికే ఆకట్టుకున్నాయి. మరి మ్యానిఫేస్టోలో ఏఏ అంశాలు ఉంటాయన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
Next Story