Fri Mar 27 2026 11:40:20 GMT+0530 (India Standard Time)
Ayodhya : అయోధ్యలో శ్రీరామనవమి వేడుకలు
అయోధ్యలో శ్రీరామనవమి వేడుకలు నేడు అత్యంత వైభవంగా జరగనున్నాయి

అయోధ్యలో శ్రీరామనవమి వేడుకలు నేడు అత్యంత వైభవంగా జరగనున్నాయి. లక్షలాది మంది భక్తుల సమక్షంలో జరగనున్నాయి. రామ మందిరంలో బాలరాముడికి ప్రత్యేక అభిషేకం, మధ్యాహ్నం 12:27 గంటలకు సూర్యకిరణాలతో సూర్యతిలకం, మరియు శోభాయాత్రలు ఈ వేడుకల ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయి.
ఐదు వందల ఏళ్ల తర్వాత...
500 ఏళ్ల తర్వాత నూతన మందిరంలో జరుగుతున్న ఈ వేడుకల కోసం భక్తులు తెల్లవారుజాము నుంచే పోటెత్తుతున్నారు. రామ్ లల్లా దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. గంటల సమయం దర్శనం కోసం వేచి చూడాల్సి వస్తుంది. అధిక సంఖ్యలో భక్తులు వస్తుండటంతో ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
Next Story

