Sun May 19 2024 20:33:19 GMT+0000 (Coordinated Universal Time)
టాస్ గెలిచిన భారత్.. ఒక ఓవర్ లో మూడు నోబాల్స్
రెండో టీ 20 మ్యాచ్ ప్రారంభమయింది. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ను ఎంచుకుంది. తొలుత శ్రీలంక బ్యాటింగ్ కు దిగింది
రెండో టీ 20 మ్యాచ్ ప్రారంభమయింది. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ను ఎంచుకుంది. తొలుత శ్రీలంక బ్యాటింగ్ కు దిగింది. మొదటి ఓవర్ లోనే అర్షదీప్ మూడు నో బాల్స్ వేశాడు. ముంబయి వేదికగా జరిగిన తొలి టీ 20 మ్యాచ్ లో భారత్ గెలిచింది. ఈ మ్యాచ్ కూడా గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని భారత్ బరిలోకి దిగింది.
కొద్ది మార్పులతో...
కొద్ది మార్పులతో టీం ఇండియా బరిలోకి దిగింది. సంజూ శాంసన్ గాయం కారణంగా ఈ మ్యాచ్ కు దూరమయ్యాడు.ఆయన స్థానంలో జితేష్ శర్మకు అవకాశం కల్పించింది. ఉమ్రాన్ బదులు అర్షదీప్ ఈ మ్యాచ్ లో ఆడుతున్నారు. అర్షదీప్ వేసిన తొలి ఓవర్ లోనే మూడు నో బాల్స్ వేశారు. 2.2 ఓవర్లు ముగిసే సమయానికి శ్రీలంక 29 పరుగులు చేసింది.
Next Story