IPL 2025 : ప్లేఆఫ్ కు చేరువలో బెంగళూరు... ఢిల్లీపై కసి తీర్చుకున్న ఛాలెంజర్స్
ఢిల్లీలో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఢిల్లీ కాపిటల్స్ పై విజయం సాధించింది.

ఈ ఐపీఎల్ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పడుతూ.. లేస్తూ వస్తున్నా మొత్తానికి ప్లేఆఫ్ కు చేరువలోకి వచ్చింది. ఇప్పటికే పథ్నాలుగు పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఏడు విజయాలను సొంతం చేసుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఇక ప్లేఆఫ్ లో చోటు సంపాదించుకునేందుకు పెద్ద కష్టమేమీ కాదు. ఎందుకంటే మిగిలిన జట్ల కంటే పాయింట్లలోనూ, రన్ రేట్ లోనూ మెరుగ్గా ఉండటమే దీనికి కారణం. సొంత గడ్డ బెంగళూరుపై తమను ఓడించామన్న కసితో రగిలిపోతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు చివరకు దాని సొంత మైదానమైన ఢిల్లీలోనే ఢిల్లీ కాపిటల్స్ జట్టును మట్టికరిపించి రివెంజ్ తీర్చుకున్నట్లయింది. విరాట్ కోహ్లి తాను చిన్నప్పటి నుంచి ఆడిన మైదానంలో మరోసారి బ్యాట్ ఝులిపించాడు. అర్ధ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. ఢిల్లీలో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఢిల్లీ కాపిటల్స్ పై విజయం సాధించింది.

